లాస్ ఏంజిల్స్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ను ఆ దేశానికి చెందిన 16 రాష్ట్రాలు కోర్టుకీడ్చాయి. మెక్సికో సరిహద్దు వద్ద గోడ నిర్మాణం కోసం దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించిన ట్రంప్పై ఆ రాష్ట్రాలు కోర్టులో దావా వేశాయి. కాలిఫోర్నియా రాష్ట్రం ఆ బృందానికి నాయకత్వం వహిస్తున్నది. వాల్ ప్రాజెక్టు కోసం ట్రంప్ అక్రమ పద్ధతిలో నిధులు సేకరిస్తున్నారని ఆయా రాష్ట్రాలు ఆరోపిస్తున్నాయి. ట్రంప్ చర్యను ఖండిస్తూ డెమోక్రాట్లు కూడా కోర్టుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అధ్యక్ష అధికారాలను ట్రంప్ దుర్వినియోగం చేస్తున్నారని కాలిఫోర్నియా అటార్నీ జనరల్ గ్జేవియర్ బెసిరా తెలిపారు. చట్టబద్దంగా పన్నుల ద్వారా వచ్చిన సొమ్మును ప్రజలకు ఖర్చు చేయాలని, కానీ ట్రంప్ వాటిని గోడ నిర్మాణం కోసం వాడడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు కాలిఫోర్నియా అటార్నీ తెలిపారు. 16 రాష్ట్రాలు కోర్టును ఆశ్రయించడంతో.. ట్రంప్ తన ఎమర్జెన్సీ ప్రకటనను వెనక్కి తీసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత కోర్టులో ఈ కేసు వాదనలు జరగనున్నాయి.
Mon Jan 19, 2015 06:51 pm