ధన్బాద్: జార్కండ్లోని ధన్బాద్ డీజీఎన్కు చెందిన రాయ్-ఖలారీ స్టేషన్ సమీపంలోని రైలు పట్టాలపై బాంబు పేలుడు సంభవించింది. దీంతో ఈ మార్గం గుండా వస్తున్న రెండు గూడ్సు రైళ్లు ధ్వంసమయ్యాయి. ఈ రెండు గూడ్సు రైళ్లకు చెందిన డ్రైవర్లు, సహాయకులు బాంబు పేలుడు కారణంగా గాయపడ్డారు. ప్రమాదం గురించి తెలుసుకున్న రైల్వే ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm