హైదరాబాద్ : ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్ తన సైట్లో ఇవాళ మొబైల్స్ బొనాంజా సేల్ను ప్రారంభించింది. ఈ సేల్ ఈ నెల 23వ తేదీ వరకు కొనసాగనుంది. ఇందులో భాగంగా పలు కంపెనీలకు చెందిన స్మార్ట్ఫోన్లపై ఆకట్టుకునే ఆఫర్లు, రాయితీలను అందిస్తున్నారు. సేల్లో యాపిల్ ఐఫోన్ XR రూ.8901 తగ్గింపు ధరతో రూ.67,999 ధరకు లభిస్తున్నది. అలాగే గూగుల్ పిక్సల్ 2 ఎక్స్ ఎల్ రూ.37,999 ధరకు, గెలాక్సీ ఎస్8 రూ.30,990 ధరకు, అసుస్ జెన్ఫోన్ 5జడ్ (8జీబీ, 256 జీబీ) రూ.28,999 ధరకు లభిస్తున్నాయి. అలాగే ఎల్జీ జీ7 థిన్క్యూ, ఎల్జీ వీ30 ప్లస్, అసుస్ జెన్ఫోన్ మ్యాక్స్ ప్రొ ఎం2, నోకియా 6.1 ప్లస్, అసుస్ జెన్ఫోన్ మ్యాక్స్ ప్రొ ఎం1, మోటో జీ6 ప్లే, హానర్ 9ఎన్, నోకియా 5.1 ప్లస్ తదితర ఫోన్లపై భారీ తగ్గింపు ధరలను అందిస్తున్నారు. ఇక యాక్సిస్ బ్యాంక్కు చెందిన డెబిట్ లేదా క్రెడిట్ కార్డులను ఉపయోగించి ఫోన్లను కొనుగోలు చేస్తే 10 శాతం ఇన్స్టంట్ డిస్కౌంట్ ఇస్తారు.
Mon Jan 19, 2015 06:51 pm