ద హేగ్: అంతర్జాతీయ కోర్టులో ఓ కొత్త వాదనకు తెర తీసింది పాకిస్థాన్. 2014లో పెషావర్లోని సైనిక స్కూల్పై జరిగిన ఉగ్రదాడి ఇండియా పనే అని వాదించింది. ఈ ఘటనలో 140 మంది చిన్నారులు మృత్యువాత పడ్డారు. తెహ్రీకి తాలిబన్ పాకిస్థాన్ ఈ దాడికి పాల్పడింది. అయితే కుల్భూషణ్ జాదవ్ కేసు విచారణలో భాగంగా తన వాదనలను వినిపించిన పాకిస్థాన్.. ఆ నిందను భారత్పై మోపే ప్రయత్నం చేసింది. పాకిస్థాన్ తరఫున ఆ దేశ అటార్నీ జనరల్ అన్వర్ మన్సూర్ ఖాన్ వాదనలు వినిపించారు. కుల్భూషణ్ రా ఏజెంట్ అని, అతడు పాకిస్థాన్లో ఉగ్రవాద దాడులకు ప్రణాళిక రచించేవాడని పాక్ ఆరోపించింది. అయితే అతన్ని ఇరాన్ నుంచి కిడ్నాప్ చేసి తీసుకొచ్చి అన్యాయంగా ఉరిశిక్ష వేసిందని ఇండియా వాదిస్తున్నది.
Mon Jan 19, 2015 06:51 pm