అమరావతి: ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని పూర్తి చేస్తున్న పోలవరం ప్రాజెక్ట్ నుండి వచ్చే వ్యర్ధాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని.. ఇది పర్యావరణానికి నష్టం కలిగిస్తుందని జాతీయ హరిత ట్రిబ్యునల్ లో దాఖలైన పిటిషన్ ఈరోజు విచారణకు వచ్చింది. ఎన్జీటీ ప్రధాన న్యాయమూర్తి ఏకే గోయల్ ధర్మాసనం విచారణ చేపట్టారు. పోలవరం వ్యర్ధాల డంపింగ్ పై విచారించిన ట్రిబ్యునల్ డంపింగ్ తప్పులను నెలలో సరిదిద్దాలని పోలవరం అధారిటీకి ఆదేశించారు. ప్రాజెక్ట్ అధారిటీ తీసుకున్న చర్యలపై నెలలో నివేదిక ఇవ్వాలని ఆదేశించగా పర్యావరణానికి ఎంతనష్టం జరిగిందో కూడా అంచనావేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను మే 10కి వాయిదా వేసింది.
Mon Jan 19, 2015 06:51 pm