హైదరాబాద్ : కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. కామారెడ్డి ఆర్టీఒ కార్యాలయంలో కానిస్టేబుల్ సుధాకర్ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. దీంతో బాధితుడిని చికిత్స కోసం కామారెడ్డి ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. కాగా, సుధాకర్ ఎందుకు ఆత్మహత్యాయత్నం చేశాడనేది తెలియాల్సి ఉంది.
Mon Jan 19, 2015 06:51 pm