హైదరాబాద్ : గుంటూరు వెస్ట్ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి వైసీపీలో చేరారు. వైసీపీ తరపున సత్తెనపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కానీ లేదా నరసరావు పేట ఎంపీ నియోజకవర్గం నుంచి కానీ ఆయన బరిలో దిగుతారని సమాచారం. మోదుగుల టీడీపీలోనే కొనసాగుతున్నా వైసీపీ అధినేత జగన్తో ఆయనకు సత్సంబంధాలున్నాయి. 2019 ఎన్నికల్లో మోదుగులకు చంద్రబాబు టికెట్ నిరాకరిస్తారని ముందే ప్రచారం జరిగింది. దీంతో ఆయన వైసీపీలో చేరినట్లు తెలుస్తోంది.
Mon Jan 19, 2015 06:51 pm