చెన్నై: లోక్సభ ఎన్నికలకు ముందు బీజేపీకి ఓ కొత్త మిత్రుడు దొరికాడు. తమిళనాడులో అన్నాడీఎంకేతో బీజేపీకి పొత్తు కుదిరింది. ఈరోజు కేంద్ర మంత్రి పియూష్ గోయల్, తమిళనాడు సీఎం పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీరుసెల్వం చర్చలు జరిపి పొత్తును ఖరారు చేశారు. ఇందులో భాగంగా బీజేపీ ఐదు స్థానాల్లో పోటీ చేయనుందని పన్నీరుసెల్వం ప్రకటించారు. తమిళనాడు, పుదుచ్చెరిల్లో బీజేపీ, అన్నాడీఎంకే కలిసి పోటీ చేస్తాయని ఆయన స్పష్టం చేశారు. ఈ డీల్లో భాగంగా తమిళనాడులో 21 అసెంబ్లీ స్థానాలకు, జరగబోయే ఉప ఎన్నికల్లో అన్నాడీఎంకేకు బీజేపీ మద్దతిస్తుందని పియూష్ గోయల్ వెల్లడించారు. లోక్సభ ఎన్నికల్లో తమదే విజయమని ఈ సందర్భంగా పన్నీరుసెల్వం విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ కూటమిలో బీజేపీ, అన్నాడీఎంకేతోపాటు పీఎంకే కూడా ఉంది. ఆ పార్టీ 7 లోక్సభ స్థానాల్లో పోటీ చేయనుంది. తమిళనాడు, పుదుచ్చెరిల్లో కలిపి మొత్తం 40 లోక్సభ స్థానాలు ఉన్నాయి.
Mon Jan 19, 2015 06:51 pm