హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో ఈడీ అధికారులు.. రేవంత్ రెడ్డిని విచారించారు. బుధవారం మరోసారి విచారించనున్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పా. బుధవారం కూడా మళ్లీ విచారణకు రమ్మన్నారు. విచారణకు హాజరై అన్ని సమాధానాలు చెబుతా. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో కుమ్మక్కై శాసనసభ ఎన్నికలప్పుడు కూడా నాపై ఐటీ అధికారులను ప్రయోగించారు. పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టిని మళ్లీ ఇప్పుడు ఈడీని ప్రయోగిస్తున్నారు. ఇది రాజకీయ కక్ష్య సాధింపు. మోడీ, కేసీఆర్లది పెవికాల్ బంధం. ఎంఎల్ సీ ఎన్నికలప్పుడు ఏసీబీని ఉపయోగించి కేసీఆర్ గెలిచాడు. మొన్న జరిగిన ఎన్నికల్లో అనేక అక్రమాలకు పాల్పడ్డాడు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడతాననే కావాలనే నాపై కేసులు పెట్టారు. తల తెగి పడినా సరే.. కేసీఆర్ అక్రమాలపై మాట్లాడుతూనే ఉంటా. నీ కర్మ కాలిన రోజు నువ్వూ ఊచలు లెక్కపెడుతావు. అప్పుడు మోడీ కూడా అపలేడు. A5 వరకు జైల్కు పంపించారు.మోడీ మోజు పడి కేంద్ర దర్యాప్తు సంస్థలతో గంటల కొద్ది విచారిస్తున్నారు. చార్జిషీట్లు దాఖలు చేసిన తర్వాత మళ్లీ కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరుపుతున్నారు. విచారణ పూర్తయిన తర్వాత మూడో కృష్ణుడు ఈడీ ఏం తేల్చుతుంది. అన్ని అన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm