హైదరాబాద్: నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే నంద్యాల శ్రీనివాస్ రెడ్డి కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బుధవారం తెల్లవారు జామున తుది శ్వాస విడిచారు. ప్రస్తుతం ఆయన వయస్సు 101 ఏళ్లు. ఆయన భౌతిక కాయాన్ని నార్కట్పల్లి కామినేని ఆస్పత్రికి అప్పగించనున్నట్టు కుటుంబ సభ్యులు వెల్లడించారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సమావేశం సంతాపం తెలిపింది. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ ఉత్తర తెలంగాణలో కమ్యూనిస్టు పార్టీ నిర్మాతలలో ఒక్కరిగా, నకిరేకల్ సమితీ అధ్యక్షునిగా, ఎమ్మేల్యేగా సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యునిగా పార్టీకి ,ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండే వ్యక్తి నంద్యాల శ్రీనివాస్ రెడ్డి అని అన్నారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కమీటీ తరపున వారి నివాళులు అర్పించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతిని తెలియచేశారు.
Mon Jan 19, 2015 06:51 pm