హైదరాబాద్: ఎస్ఎన్ఆర్హెచ్ విశ్రాంతి అతిథి గృహాల వద్ద దొంగలు హల్ చల్ చేశారు. తిరుమల దర్శనానికి వచ్చిన పెళ్లి బృందం ఎస్ఎన్ఆర్హెచ్ విశ్రాంతి అతిథి గృహాలలో దిగారు. నిన్న రాత్రి పెళ్లి బృందం తిరుమల దర్శనానికి వెళ్లి తిరిగి వచ్చేప్పటికి, వారు ఉన్న 6 గదుల్లో (39, 40, 41, 42, 44, 52) దొంగలు చోరీ చేశారు. గదులు తెరచి ఉండటాన్ని చూసిన తిరుమల భక్తులు ఆందోళన చెందారు. చోరీ జరిగినట్లు గుర్తించి, వెంటనే విజిలెన్స్ అధికారులకు సమాచారం ఇచ్చారు. గదులలో దొంగతనం ఏ విధంగా జరిగింది అనే విషయంపై విజిలెన్స్ అధికారులు దర్యాప్తు చేపట్టారు.
Mon Jan 19, 2015 06:51 pm