కొత్తగూడెం: సీపీఐ(ఎం) భద్రాచలం మాజీ ఎంపీ బాబురావ్ టీఆర్ఎస్ వ్యవహర శైలిపై మండిపడ్డారు. ఈరోజు కమ్యూనిస్టు పార్టీ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... పార్టీ తరుపున బరిలో ఉన్న ఉమ్మడి అభ్యర్ధి వెంకట్ ను భారీ మెజార్టీ తో గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే సాంబశివరావ్, వెంకట్, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.