హైదరాబాద్ : ఏ పార్టీతో పొత్తు లేకుండా 17 స్థానాల్లో ఒంటరిగానే పోటీ చేస్తున్నామని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జీ కుంతియా వెల్లడించారు. సెక్యులర్ పార్టీలన్నీ కాంగ్రెస్కి సపోర్ట్ చేయాలని ఆయన కోరారు. పుల్వామా ఘటనను రాజకీయాలకు వాడుకోవడం దారుణమని అన్నారు. మోదీకి టీఆర్ఎస్ బీ టీమ్గా పనిచేస్తోందని కుంతియా ఆరోపించారు. మరోవైపు కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ మాట్లాడుతూ 70 ఏళ్లలో కాంగ్రెస్ ఏం చేసిందని కేటీఆర్ పొగరుగా మాట్లాడుతున్నారని, దేశానికి స్వాతంత్ర్యం తెచ్చింది, తెలంగాణ ఇచ్చింది కూడా కాంగ్రెస్సేనని అలీ తెలిపారు. సీఎం కేసీఆర్ని యూత్ కాంగ్రెస్లోకి తెచ్చింది కాంగ్రెస్సేనని, 'పీకుడు' అన్న పదాన్ని కేటీఆర్ విత్డ్రా చేసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. జగన్, కేసీఆర్ మిత్రపక్షాలేనని సాక్షాత్తూ కేంద్రమంత్రి పీయూశ్ గోయలే చెప్పారని, దీంతో అవి రెండూ ఒక్కటేనని తేలిపోయిందని షబ్బీర్ అలీ అన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm