హైదరాబాద్ : ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివ ప్రసాద్ ఎన్నికలలో జరిగిన గొడవలలో తన చొక్కా తానే చించుకున్నారన్నారు వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి. టీడీపీ, ఈవీఎంల భద్రతలపై ఈసీకి ఫిర్యాదు చేసిన అనంతరం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన విసా రెడ్డి కోడెల పోలింగ్ బూత్లోకి వెళ్లి అక్రమాలు చేశారని.. పలుచోట్ల టీడీపీ నేతలు హింసకు పాల్పడ్డారని ధ్వజమెత్తారు. సీఎం చంద్రబాబు తొత్తులు ఎస్పీలుగా ఉన్నచోట్లే హింస జరిగిందని, టీడీపీ నేతలకు ఓటమి భయం పట్టుకుందన్నారు. ఓటింగ్ మిషన్లు పనిచేయక అర్థరాత్రి వరకు సమయం పొడిగించారని.. ఓటింగ్ మిషన్లు మొరాయించడం.. మహిళలు గంటల తరబడి క్యూలో నిరీక్షించడం ఈసీ వైఫల్యం కాదని విజయసాయిరెడ్డి ఈసీని వెనకేసుకొచ్చారు.
Mon Jan 19, 2015 06:51 pm