హైదరాబాద్ : శ్రీలంక రాజధాని కొలంబోలో వరుస బాంబు పేలుళ్ల ఘటనపై తెలంగాణ సీఎం కేసీఆర్ స్పందించారు. ఈ దాడులను ఖండిస్తున్నామని అన్నారు. ఉగ్రవాదుల చర్య అత్యంత హేయమైందిగా అభివర్ణించారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని, గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నానని అన్నారు. కాగా, కొలంబోలో 8 చోట్ల వరుస బాంబు పేలుళ్లు సంభవించాయి. పేలుళ్లలో 250 మందికిపైగా మృతి చెందగా, మూడు వందల మందికి పైగా గాయపడ్డారు. పేలుళ్ల మృతుల్లో 35 మంది విదేశీయులు ఉన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm