హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ తరుపున ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ ప్రచారాన్ని మరింత ముమ్మరం చేశారు. అయితే తాను పోటీ చేసే విషయమై ఆమె గతంలో పార్టీ ఆదేశిస్తే ఎక్కడి నుంచైనా సిద్ధమని ప్రకటించారు. ఈ విషయమై నేడు ఆమె మరోసారి స్పందించారు. ప్రధాని నరేంద్ర మోడీ ఈ సారి కూడా ఉత్తరప్రదేశ్లోని వారణాసి నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఆయనకు పోటీగా ప్రియాంక పోటీ చేసే అవకాశం ఉందని గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. నేడు ఆమె కూడా ఆ విషయాన్ని స్పష్టం చేశారు. ఉత్తరప్రదేశ్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న ప్రియాంక ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్ అధ్యక్షుడు, తన సోదరుడు రాహుల్ ఆదేశిస్తే వారణాసి నుంచి సంతోషంగా పోటీ చేస్తానని ప్రకటించారు. పలువురు ముఖ్య కాంగ్రెస్ నేతలు కూడా ఇదే కోరుకుంటున్నారు. మరి రాహుల్ దీనిపై ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.
Mon Jan 19, 2015 06:51 pm