హైదరాబాద్ : విలీనం తర్వాత బ్యాంక్ ఆఫ్ బరోడాకు చెందిన దాదాపు 900 బ్రాంచీలను క్రమబద్దీకరించాల్సిన అవసరం ఉంది. బ్యాంక్ కార్యకలాపాలను మరింత శక్తివంతంగా చేసేందుకు ఇది చాలా అవసరం. ఏప్రిల్ 1న దేనా బ్యాంక్, విజయాబ్యాంక్, బీవోబీలో విలీనం అయ్యాయి. ఈ విలీనం తర్వాత ఒకే ప్రదేశంలో దేనా, విజయా బ్యాంక్ శాఖలు ఉన్న చోట కొన్నిటిని కొనసాగించి కొన్నిటిని మార్చాల్సి ఉంటుంది. కొన్ని చోట్ల మూడు బ్యాంకుల బ్రాంచిలు సమీపంలో ఉన్నాయి. దీంతో కొన్ని బ్రాంచిలను తొలగించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఒక సమగ్ర సమీక్షను నిర్వహించిన బీవోబీ దాదాపు 800-900 బ్రాంచిలలో మార్పులు చేయాల్సి ఉందని గుర్తించింది. దీంతోపాటు అదనంగా ఉన్న రీజనల్, జోనల్ కార్యాలయాను మూసివేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం స్టేట్బ్యాంక్ ఆఫ్ ఇండియా తర్వాత బీవోబీకే అత్యధిక శాఖలు, ఏటీఎంలు ఉన్నాయి. మొత్తం 9,500 శాఖలు, 13,400 ఏటీఎంలు, 85,000 ఉద్యోగులు, 12 కోట్ల కస్టమర్లు ఉన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm