హైదరాబాద్ : హాజీపూర్ సైకో శ్రీనివాస్ ను ఉరితీయాల్సిందేనని అతని సోదరుడు, నా కొడుకు చెడబుట్టాడు చంపేయండని కన్న తండ్రి తెగేసి చెప్తుండగా గ్రామంలో శ్రీనివాస్ ఉరికొరుతూ దీక్ష చేస్తున్నారు. కాగా మరో పక్క బాలికల హత్యల ఉదంతంలో మరోకొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ముగ్గురు బాలికలను అత్యాచారం చేసి చంపేసిన శ్రీనివాసరెడ్డి మృతదేహాలను బావిలో పూడ్చిపెట్టాక పక్కనే ఉన్న మేడిచెట్టుకు రోజూ పూజలు చేసేవాడట. ఈ చెట్టుపై మనీషా, కల్పన, శ్రావణి పేర్లను చెక్కిన సైకో పక్కనే రావి, వేపచెట్టుకు పేర్లు పెట్టుకొని పూజలు చేసేవాడట. హత్యలు వెలుగులోకి వచ్చిన తర్వాత కూడా ఏమాత్రం బెరుకులేకుండా శ్రీనివాసరెడ్డి చెట్లకు నీళ్లు పోసి పసుపు, కుంకుమ బొట్లను పెట్టి పూజించేవాడని స్థానికులు పేర్కొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm