హైదరాబాద్ : ఎలక్ట్రానిక్స్ తయారీదారు శాంసంగ్ తన గెలాక్సీ ఎస్10 ప్లస్ స్మార్ట్ఫోన్కు గాను ఒలంపిక్ గేమ్స్ ఎడిషన్ ను తాజాగా విడుదల చేసింది. ఈ ఫోన్ వెనుక భాగంలో టోక్యో ఒలంపిక్స్ లోగో ఉంటుంది. ఇక ఈ ఫోన్ ను వైట్ కలర్లో డిజైన్ చేశారు. రెగ్యులర్ వెర్షన్ కన్నా భిన్నమైన ప్యాకింగ్లో ఈ ఫోన్ లభిస్తుంది. ఇక గెలాక్సీ ఎస్10 ప్లస్ ఫోన్లోని ఫీచర్లనే ఇందులోనూ అందిస్తున్నారు. కాగా ఈ ఫోన్ రూ.70,420 ధరకు వినియోగదారులకు జూలై నెలలో లభ్యం కానుంది.
Mon Jan 19, 2015 06:51 pm