#WATCH: 102-yr old Shyam Saran Negi, 1st voter of Independent India, cast his vote for #LokSabhaElections2019 in Kalpa, Kinnaur earlier today. He was welcomed by officials with traditional folk music. He had cast the first vote in the 1951 general elections. #HimachalPradesh pic.twitter.com/IgaghNgykr
— ANI (@ANI) May 19, 2019
హైదరాబాద్ : లోక్సభ ఎన్నికల చివరి దశ పోలింగ్లో 102 ఏళ్ల శ్యామ్ శరణ్ నేగి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. శరణ్ నేగికి ఓ ప్రత్యేకత ఉంది. ఆయనే భారత తొలి ఓటరు. స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న మొట్టమొదటి భారతీయుడు నేగినే. హిమాచల్ప్రదేశ్లోని కల్పా పాఠశాల కేంద్రంలో నేగి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా నేగిని అధికారులు బ్యాండ్ బజాతో గౌరవంగా పోలింగ్ కేంద్రానికి తీసుకొచ్చి ఓటేయించారు. నేగి ఇప్పటి వరకు లోక్సభ ఎన్నికల్లో 16 సార్లు, అసెంబ్లీ ఎన్నికల్లో 13 సార్లు, కేంద్ర పాలిత ప్రాంతంలో జరిగిన ఎన్నికల్లో రెండుసార్లు ఓటేశారు.