హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్లోని 25 లోక్సభ స్థానాల ఎగ్జిట్ పోల్స్ను ఇండియా టుడే వెల్లడించింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 18 - 20 స్థానాలు, తెలుగు దేశం పార్టీకి 4-6 స్థానాలు వచ్చే అవకాశం ఉందని తెలిపింది. జనసేన పార్టీకి ఒక్క స్థానం కూడా వచ్చే అవకాశం లేదని ఈ ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. అయితే సీ-ఓటర్ ఎగ్జిట్ పోల్స్లో మాత్రం.. టీడీపీకి 14, వైసీపీకి 11 ఎంపీ స్థానాలు వచ్చే అవకాశం ఉందని వెల్లడించింది. న్యూస్-18 సర్వే ప్రకారం టీడీపీకి 10-12, వైసీపీకి 13-14 స్థానాలు వచ్చే అవకాశం ఉంది.
Mon Jan 19, 2015 06:51 pm