హైదరాబాద్ : పంజాబ్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత కెప్టెన్ అమరీందర్ సింగ్, తన మంత్రివర్గంలోని నవ్జ్యోత్సింగ్ సిద్ధూపై ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రిగా తన స్థానాన్ని భర్తీ చేయాలని సిద్ధూ అనుకుంటున్నారని అన్నారు. సిద్ధూ తన ప్రవర్తనతో పార్టీ పరువును దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. సార్వత్రిక ఎన్నికల తుది విడతలో ఓటు వేసేందుకు వెళ్లే ముందు ఆయన మీడియాతో మాట్లాడారు. 'సిద్ధూతో ఎలాంటి మాటల యుద్ధం లేదు. ప్రజలందరికీ లక్ష్యాలుంటాయి. ఆయనకు కూడా బలమైన లక్ష్యం ఉంటే చాలా మంచిది. ఆయన నాకు చిన్నతనం నుంచే తెలుసు. ఆయన ముఖ్యమంత్రిగా నా స్థానాన్ని భర్తీ చేయాలనుకుంటున్నారు' అని సీఎం అమరీందర్ సింగ్ అన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm