హైదరాబాద్: గాయాలకు కట్టుకట్టడానికి ఒక కొత్త రకం బ్యాండేజీ ని శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఈ బ్యాండేజీ విద్యుత్ క్షేత్రాన్ని సృష్టించడం ద్వారా బ్యాక్టీరియల్ బయోఫిల్మ్ ఏర్పడకుండా అడ్డుకుంటుంది. దీన్ని రూపొందించిన శాస్త్రవేత్తల్లో భారత సంతతికి చెందిన చందన్సేన్, శాశ్వతిరాయ్ లు ఉన్నారు. ఈ బ్యాండేజీ లు అందుబాటులోకి వస్తే గాయాలకు యాంటీ బయోటిక్స్ ఉపయోగించాల్సిన అవసరం లేదు. ఈ కరెంట్ హానికరం కాదని నిపుణులు తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm