హైదరాబాద్: జయప్రద, పూర్ణ, సాక్షి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం సువర్ణసుందరి. ఎం.ఎస్.ఎన్ సూర్య దర్శకత్వం వహించారు. ఈ చిత్ర రిలీజ్ ట్రైలర్ను సోమవారం విడుదల చేశారు. రాణి పాత్రలో నటించిన సాక్షి ఓ వ్యక్తిని కత్తితో పొడిచి పైకి లేపి చంపడం, అమ్మవారి విగ్రహం కారణంగా జరిగే సంఘటనలను ట్రైలర్లో ఉత్కంఠభరితంగా ఉన్నాయి. నేపథ్య సంగీతం హైలైట్గా నిలిచింది. సాయి కుమార్, కోటా శ్రీనివాస్, నాగినీడు, సత్యప్రకాశ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. సాయి కార్తిక్ సంగీతం అందించిన ఈ చిత్రం 31న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Mon Jan 19, 2015 06:51 pm