చిత్తూరు: చంద్రగిరిలోని 5 కేంద్రాల్లో జరిగిన అక్రమాలపై ఈసీ కొరడా ఝులిపించింది. 321, 104, 316, 318, 313 పోలింగ్ కేంద్రాల ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారులపై సస్పెన్షన్ వేటు వేసింది. అధికారులను సస్పెండ్ చేస్తూ ఈసీ కార్యాలయం ఆదేశాలు జారీ చేసింది. ఆయా అధికారులపై శాఖాపరమైన చర్యలూ చేపట్టాలని ఆదేశించింది. పోలింగ్ కేంద్రాల వద్ద అక్రమాలకు పాల్పడిన వారిపై కేసు నమోదు చేయాలని ఆదేశించింది.
Mon Jan 19, 2015 06:51 pm