హైదరాబాద్: సాంఘిక, గిరిజన సంక్షేమ గురుకుల కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ప్రవేశాల కోసం tgugcet.cgg.gov.in వెబ్సైట్లో ఆన్లైన్ ద్వారా టీజీయూజీ సెట్-2019 దరఖాస్తు చేసుకోవాలి. ఈనెల 22 దరఖాస్తుకు చివరితేదీ కాగా జూన్ 8న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. ఇంటర్లో 40శాతం మార్కులు పొందిన విద్యార్థులు రాష్ట్రంలో 30 సాంఘిక సంక్షేమ డిగ్రీ కళాశాలు, 22 ఎస్టీ గురుకుల డిగ్రీ కళాశాలలో సీట్లు ఉన్నాయని గురుకులాల కార్యదర్శి ప్రవీణ్ కుమార్ తెలిపారు. ప్రతి విద్యార్థిపై రూ.75వేలు ఖర్చు చేసి నాణ్యమైన విద్యను రాష్ట్ర ప్రభుత్వం అందిజేస్తోందని అన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm