హైదరాబాద్: వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో నిందితులకు మరోసారి రిమాండ్ పొడిగించారు. పులివెందుల కోర్టు వివేకా హత్యకేసులో నిందితులకు జూన్ 3 వరకు పొడిగించారు. వివేకా హత్య కేసులో సాక్ష్యాలు తారుమారు చేశారని ఎర్రగంగిరెడ్డి, కృష్ణారెడ్డి, ప్రకాష్ అనే ముగ్గురిని పోలీసులు పులివెందుల కోర్టులో హాజరుపరచగా కోర్టు రిమాండ్ పొడిగించింది. నిందితులు ముగ్గురు తమను కడప నుండి పులివెందుల సబ్ జైలుకు తరలించాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా నిందితుల విజ్ఞప్తిని అంగీకరించిన న్యాయస్థానం నిందితులను పులివెందుల సబ్ జైలుకు తరలించాలని ఆదేశించింది.
Mon Jan 19, 2015 06:51 pm