చెన్నై: తమిళనాడులోడు నేషనల్ ఇన్వేస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్ఐఏ) దాడులు చేపట్టింది. తమిళనాడులోని 10 ప్రాంతాల్లో దాడులు చేయడం ప్రారంభించింది. రాష్ట్రంలోని సేలం, రామంతపూర్, చిదంబరం ప్రాంతాల్లో సోదాలు చేస్తోంది. ఐఎస్ఐఎస్తో సంబంధం ఉన్న వ్యక్తులు తమిళనాడులో ఉన్నట్టు సమాచారం అందడంతో అధికారులు దాడులు నిర్వహించారు. జనవరి 8వ తేదీన ఎన్ఐఏ అధికారులు 8 మంది ఐఎస్ఐఎస్ తీవ్రవాదులను అరెస్టు చేసిన విషయం తెలిసిందే.