హైదరాబాద్ : పశ్చిమ గోదావరి జిల్లాలో కొవ్వూరు స్థానాన్ని వైసీపీ కైవసం చేసుకుంది. టీడీపీ అభ్యర్థి అనితపై వైసీపీ అభ్యర్థి తానేటి వనిత ఘన విజయం సాధించారు. టీడీపీకి బాగా పట్టున్న జిల్లాల్లో పశ్చిమ గోదావరి జిల్లా ఒకటి. ఈ సారి అక్కడ వైసీపీ ఎక్కువ స్థానాలను కైవసం చేసుకుని జిల్లాపై పట్టు సాధించింది. జిల్లాలో కొవ్వూరుతో పాటు గతంలో టీడీపీ స్థానాలైన చింతలపూడి, దెందులూరు, ఏలూరు స్థానాలను వైసీపీ తన ఖాతాలో వేసుకుంది.
Mon Jan 19, 2015 06:51 pm