హైదరాబాద్ : సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మొదటి సంతకం దేనిపై చేస్తారన్న ప్రశ్నకు కాబోయే ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిని విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, 'నవరత్నాలు'ను నేను గట్టిగా నమ్ముతున్నా. నా పాదయాత్రలో ప్రజలు పడిన కష్టాన్ని చూశా, ప్రజలు చెప్పిన బాధలను విన్నాను. ప్రతిఒక్కరికి నేను హామీ ఇస్తున్నా. 'నేను చూశా.. నేను విన్నా.. నేను ఉన్నా' అని ఈరోజున ప్రతి ఒక్కరికీ హామీ ఇస్తున్నా. ఒక్క సంతకం కాదు.. 'నవరత్నాలు'ను తీసుకొచ్చే పాలన ఇవ్వబోతున్నానని కచ్చితంగా చెబుతున్నా'అని అన్నారు. కాగా, వైసీపీ అధికారంలోకి వస్తే ప్రజలకు ఇచ్చిన హామీలు 'నవరత్నాలు'. ఈ 'నవరత్నాలు' ను వైసీపీ మేనిఫెస్టోలో పొందుపరిచింది.
Mon Jan 19, 2015 06:51 pm