హైదరాబాద్ : ప్రజాతీర్పును తాను గౌరవిస్తున్నట్టు తూర్పు యూపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ ప్రియాంక గాంధీ పేర్కొన్నారు. తాజా ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ప్రధానమంత్రి నరేంద్రమోదీకి, బీజేపీ పార్టీకి ఆమె అభినందనలు తెలిపారు. 2019 సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న నేపథ్యంలో ఆమె ఇవాళ మీడియాతో మాట్లాడుతూ... 'ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నాం. బీజేపీ కార్యకర్తలు, నాయకులు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అభినందనలు..' అని పేర్కొన్నారు. ఉత్తర ప్రదేశ్లో మొత్తం 80 లోక్సభ స్థానాలుండగా... ప్రియాంక గాంధీ 26 నియోజక వర్గాల్లో పార్టీకోసం విస్తృత ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. అయినప్పటకీ అమేథి సహా తన ప్రభావం కనబర్చడంలో ఆమె విఫలమయ్యారని ఈ ఎన్నికల ఫలితాలు చెప్పకనే చెబుతున్నాయి.
Mon Jan 19, 2015 06:51 pm