హైదరాబాద్ : పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేన పార్టీలో అనూహ్యరీతిలో చివరి నిమిషంలో లోక్ సభ టికెట్ అందుకున్న మెగా బ్రదర్ నాగబాబు ఫలితాల్లో మాత్రం తీవ్రంగా నిరాశపరిచారు. నరసాపురం నుంచి లోక్ సభకు పోటీచేసిన నాగబాబు ఓటమిపాలయ్యారు. నరసాపురం లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీచేసిన వైసీపీ అభ్యర్థి రఘురామకృష్ణంరాజు ఘనవిజయం సాధించారు. జగన్ ప్రభంజనానికి నాగబాబు కూడా బలైనట్టు తాజా ఫలితం వెల్లడి చేస్తోంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ తాను పోటీచేసిన రెండు స్థానాల్లోనూ ఓటమిపాలైన నేపథ్యంలో, ఆ పార్టీలోని చిన్నాచితకా నాయకుల ఓటములు సాధారణ విషయాల్లా అనిపిస్తున్నాయి. పవన్ భీమవరం, గాజువాక అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి బరిలో దిగగా, ఏదీ కలిసిరాలేదు. ఓ నియోజకవర్గంలో ఆయన ఓట్ల పరంగా మూడోస్థానంతో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
Mon Jan 19, 2015 06:51 pm