హైదరాబాద్ : తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి లోక్ సభ స్థానంలో సినీ నటుడు, టీడీపీ నేత మురళీమోహన్ కోడలు మాగంటి రూప పరాజయం పాలయ్యారు. విజయానికి ఎంతో కృషి చేసినా మాగంటి రూపకు ఓటమి తప్పలేదు. రాజమండ్రి లోక్ సభ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థి మార్గాని భరత్ విజయం సాధించారు. ఈ పరాజయంతో మురళీమోహన్ కుటుంబంలో నైరాశ్యం ఆవరించింది. రాజమండ్రి సిట్టింగ్ ఎంపీ అయిన మురళీమోహన్ కొన్ని కారణాల వల్ల తాను బరిలో దిగకూడదని నిర్ణయించుకున్నారు. అయితే టీడీపీ హైకమాండ్ ఆయన కోడలు మాగంటి రూపకు లోక్ సభ టికెట్ ఇచ్చింది. ఇక్కడ మురళీమోహన్ కు ఎంతో పట్టు ఉన్నా మాగంటి రూప దాన్ని ఓట్ల రూపంలోకి మార్చుకోలేకపోయింది. స్థానిక నేతలతో సమన్వయలోపం ఆమె ఓటమికి కారణమని తెలుస్తోంది.
Mon Jan 19, 2015 06:51 pm