హైదరాబాద్ : ఏపీలోని 175 అసెంబ్లీ స్థానాలకు ఓట్ల లెక్కింపు తుది దశకు చేరుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు వైఎస్సార్సీపీకి బ్రహ్మరథం పట్టారు. ఇటు శ్రీకాకుళం మొదలు అనంతపురం వరకూ అన్ని జిల్లాల్లో వైఎస్సార్సీపీ అత్యధిక స్థానాల్లో విజయఢంకా మోగించింది. ఫ్యాన్గాలికి సైకిల్ కకావికలమైంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తొలి నుంచి స్పష్టమైన ఆధిక్యంలో కొనసాగుతోంది. టీడీపీ ఘోర పరాజయం బాటలో పయనిస్తోంది. వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ హవా జోరుగా వీస్తోంది.
ఇప్పటివరకు వైఎస్ఆర్సిపీ 148 స్థానాల్లో విజయం సాధించగా రెండు స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. టీడీపీ 19 స్థానాల్లో విజయం సాధించగా 5 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. జనసేన 1 స్థానంలో విజయం సాధించింది.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- May 23,2019 10:04PM