విశాఖ : ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం జిల్లాలో ప్రభుత్వ గుర్తింపు లేకుండా విరుద్ధంగా నడుపుతున్న 10 పాఠశాలలను జప్తు చేశామని జిల్లా విద్యాశాఖ అధికారి (డిఇఒ) వెల్లడించారు. శనివారం ఉదయం విశాఖ డిఇఒ ఓ పత్రికా ప్రకటనను విడుదల చేశారు. నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న స్కూళ్ల జాబితాలో నారాయణ స్కూలు (కైలాస మిట్ట), జాగఅతి స్కూలు (గాజువాక), గ్లోబల్ స్కూలు, సుపాద స్కూలు, లోటస్ స్కూల్స్ ఉన్నాయని పేర్కొన్నారు. స్టాన ఫర్డ్ స్కూలు, సన్ ట్రైట్ స్కూలు, నరసింహ స్కూలు, లిటిల్ ప్యారడైజ్ స్కూలు, నలందా హైస్కూల్ ను జప్తు చేశామని తెలిపారు. తల్లిదండ్రులందరూ తమ పిల్లలను ఇలాంటి ప్రభుత్వ గుర్తింపు లేని పాఠశాలలో చేర్పించకుండా జాగ్రత్త వహించాలని సూచించారు.
Mon Jan 19, 2015 06:51 pm