హైదరాబాద్ : హైదరాబాద్ శివార్లలోని పోలీసుల తనిఖీల్లో మరోసారి గంజాయి పట్టుబడింది. శనివారం ఉదయం వైజాగ్ నుండి వస్తున్న ఓ కంటెయినర్ ను నగర శివార్లలో ఆపిన పోలీసులు వాహనాన్ని తనిఖీ చేయగా.. చిన్న చిన్న ప్యాకెట్లలో నింపిన గంజాయిను గుర్తించారు. వెంటనే వాహనాన్ని సీజ్ చేసి, డ్రైవర్లను అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడ్డ నిల్వ విలువ రూ.1 కోటి కి పైగా ఉంటుందని సమాచారం. ఇటీవల సికింద్రాబాద్, పంతంగి సహా హైదరాబాద్ శివార్లలో తరచూ గంజాయి పట్టుబడుతుండటం గమనార్హం.
Mon Jan 19, 2015 06:51 pm