హైదరాబాద్ : భార్య చనిపోయిన మూడు నెలలల తర్వాత ఓ వ్యక్తి తన ముగ్గురు పిల్లల్ని చంపి తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. ఒడిశాలోని కియోంజర్ జిల్లాలో శుక్రవారం జరిగిందీ సంఘటన. ముగ్గురు పిల్లల్ని సమీపంలోని కొలనులో ముంచి చంపి అనంతరం తాను ఉరేసుకుని తనువు చాలించాడు. చనిపోయిన ముగ్గురు పిల్లల వయసు తొమ్మిదేళ్లు, ఏడేళ్లు, ఐదేళ్లు. దుర్గా సిద్ధు (32) అనే వ్యక్తి భార్య చనిపోయి మూడు నెలలైంది. ఆ దు:ఖాన్ని తట్టుకోలేని సిద్ధూ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. అయితే తాను కూడా చనిపోతే తన ముగ్గుర కూతుర్లు ఎలా బతుకుతారని అనుకున్నాడు. అయితే వారిని కూడా చంపేస్తే ఇక ఏ బాధా ఉండదని నిశ్చయించుకుని వారిని నీటిలో ముంచి చంపి అనంతరం తాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఆనందపూర్ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదెు చేసుకున్నారు. సిద్ధు తల్లి మృతదేహాల్ని గుర్తించింది. దుర్గా సిద్ధు భార్య చనిపోయి మూడు నెలలైందని, ఆ బాధ తట్టుకోలేకనే ఇలా చేశాడని ఆమె చెప్పుకొచ్చింది.
Mon Jan 19, 2015 06:51 pm