హైదరాబాద్: తిరుపతి రుయా ఆస్పత్రిలో దారుణం చోటు చేసుకుంది. సిబ్బంది నిర్లక్ష్యానికి రోగి ప్రాణాలు కోల్పోయాడు. తిరుపతికి చెందిన బాబు అనే వ్యక్తి తీవ్ర జ్వరంతో తిరుపతి రుయా ఆస్పత్రిలో చేరాడు. సమయానికి డాక్టర్లు కానీ, ఆస్పత్రి సిబ్బంది కానీ రోగిని పట్టించుకోలేదు. ఇంతలోనే.. బాబు కి ఫిట్స్ వచ్చింది. గమనించిన ఓ వ్యక్తి ఆ రోగిని కాపాడేందుకు తీవ్రంగా ప్రయత్నించాడు. హుటాహుటిన ఆస్పత్రి సిబ్బందికి చెప్పాడు అయినప్పటికీ.. ఆస్పత్రి సిబ్బంది ఎవరూ పట్టించుకోలేదు. కనీసం ఎమర్జన్సీ వార్డుకు తరలించేందుకు స్ట్రక్చర్ కూడా ఇవ్వలేదు. ఎక్కువ ఆలస్యం కావడంతో రోగి మృతి చెందాడు. ఆస్పత్రిని కలెక్టర్ సందర్శించిన కొద్దిసేపటికే ఈ ఘటన చోటు చేసుకోవడం సంచలనంగా మారింది.
Mon Jan 19, 2015 06:51 pm