విజయనగరం : బొబ్బిలిలోని బాలాజీ కెమికల్ ఫ్యాక్టరీలో శుక్రవారం రియాక్టర్ పేలి ఇద్దరు కార్మికులు మృతి చెందారు. ఆ ఇద్దరు కార్మికులకు చెందిన కుటుంబాలను శనివారం ఉదయం డిప్యూటీ సిఎం పుష్ప శ్రీవాణి పరామర్శించారు. ఇద్దరు కార్మికుల కుటుంబ సభ్యులకు ప్రభుత్వం తరుపున రూ.5 లక్షలు, పరిశ్రమ యాజమాన్యం తరుపున మరో రూ.15 లక్షల పరిహారాన్ని అందిస్తామని శ్రీవాణి తెలిపారు. పార్వతీపురాన్ని జిల్లాగా చేయాలన్న స్థానికుల డిమాండ్ ను సిఎం జగన్ దృష్టికి తీసుకెళతానని శ్రీవాణి హామీ ఇచ్చారు.
Mon Jan 19, 2015 06:51 pm