హైదరాబాద్: తన సినిమా 'అర్జున్రెడ్డి'కి హిందీ రీమేక్గా వస్తోన్న 'కబీర్ సింగ్' బ్లాక్బస్టర్ కావాలని కోరుకుంటున్నట్లు యువ కథానాయకుడు విజయ్ దేవరకొండ అన్నారు. మాతృకను తీసిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా రీమేక్ను కూడా తీశారు. బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్, కియారా అడ్వాణీ జంటగా నటించారు. ఇప్పటి వరకు విడుదలైన ప్రచార చిత్రాలకు మంచి స్పందన లభించింది. హిందీ రీమేక్ను ప్రకటించినప్పటి నుంచి విమర్శకులు మాతృకతో పోల్చుతూనే ఉన్నారు. పోస్టర్, టీజర్, ట్రైలర్.. ఇలా ప్రతి ప్రచార చిత్రం మాతృకకు ఏ మాత్రం తీసిపోకపోవడంతో మంచి అంచనాలు నెలకొన్నాయి. జూన్ 21న ఈ సినిమా విడుదల కాబోతోంది. విజయ్ను తాజా ఇంటర్వ్యూలో 'కబీర్ సింగ్' గురించి మీడియా ప్రశ్నించింది. దీనికి ఆయన స్పందిస్తూ.. 'హిందీ రీమేక్ను కూడా నా స్నేహితుడు సందీప్ తీశారు. సినిమా ఎలా వచ్చిందో చూడాలని ఆతృతగా ఉంది. 'ఇష్క్ విష్క్' (2003) సినిమా నుంచి షాహిద్ ఓ మంచి నటుడిగా నాకు తెలుసు. ఇప్పుడు 'కబీర్ సింగ్'లోనూ ఆయన అద్భుతంగా నటించి ఉంటారు. ఆ నమ్మకం నాకుంది. ఈ సినిమా బ్లాక్బస్టర్ కావాలని కోరుకుంటున్నా' అని అన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm