హైదరాబాద్ : తమిళంలో సీనియర్ హీరోగా మాధవన్ కి ఎంతో క్రేజ్ వుంది. అలాగే సీనియర్ హీరోయిన్ గా సిమ్రన్ కి కూడా మంచి ఇమేజ్ వుంది. 18 ఏళ్ల క్రితం తొలిసారిగా ఈ ఇద్దరూ బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన 'పరవశం' చిత్రంలో జంటగా నటించారు. ఆ తరువాత మణిరత్నం సినిమాలోను మెరిసిన ఈ జంట, మళ్లీ కలిసి నటించింది లేదు. అలాంటి ఈ జంట మళ్లీ ఇంతకాలానికి ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. మాధవన్ కథానాయకుడిగా .. ప్రముఖ శాస్త్రవేత్త నంబి నారాయణ బయోపిక్ తమిళంలో రూపొందుతోంది. 'రాకెటరీ: ది నంబి ఎఫెక్ట్' అనే టైటిల్ తో ఈ సినిమా నిర్మితమవుతోంది. నంబి నారాయణ పాత్రలో మాధవన్ నటిస్తుండగా, ఆయన భార్య పాత్రలో సిమ్రన్ కనిపించనుంది. మాధవన్ స్వీయ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాలో, షారుక్ .. సూర్య అతిథి పాత్రల్లో కనిపించనుండటం విశేషం.
Mon Jan 19, 2015 06:51 pm