హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్పై కాంగ్రెస్ నేత వంశీచంద్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఐదేళ్లలో ఒక్క టీచర్ ఉద్యోగం కూడా ఇవ్వని చరిత్ర కేసీఆర్ది అని విమర్శించారు. సోమవారం ఇక్కడ మీడియాతో మాట్లాడిన ఆయన.. ఉద్యోగానికి సెలక్ట్ అయిన టీఆర్టీ అభ్యర్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, అయినా ప్రభుత్వానికి చీమకుట్టినట్లైనా లేదని దుమ్మెత్తిపోశారు. విద్యాశాఖ మంత్రి సిగ్గుతో తలదించుకోవాలని వ్యాఖ్యానించారు. తక్షణమే టీఆర్టీ అభ్యర్థులకు నియామకపత్రాలు అందజేయాలని వంశీచంద్ డిమాండ్ చేశారు. స్వలాభం కోసం ఆలోచించేవారు మాత్రమే పార్టీమారే ఆలోచన చేస్తారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ బలం నాయకులు కాదని, కార్యకర్తలే కాంగ్రెస్ బలం అని పేర్కొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm