హైదరాబాద్ : సంపూర్ణ మద్య నిషేధం ఆచరణ సాధ్యం కాదని లోక్ సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ (జేపీ) మరోమారు అభిప్రాయపడ్డారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, సంపూర్ణ మద్య నిషేధానికి, మద్య నియంత్రణకు చాలా తేడా ఉందని అన్నారు. మద్యానిక బానిసైన లక్షలాది పేద కుటుంబాలు నాశనమైపోతున్నాయని అన్నారు. మద్యం ప్రభావం పేద కుటుంబాలపై తీవ్రంగా ఉందన్న విషయంలో ఎటువంటి అనుమానం లేదని,అయితే, మద్య నిషేధం ప్రపంచంలో ఎక్కడ అమలు చేసినా కొంత కాలం తర్వాత అవినీతికి ఆస్కారం ఉంటుంది కనుక, కఠిన మద్య నియంత్రణ అమలు చేయడం అవసరమని అన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Jun 17,2019 04:47PM