హైదరాబాద్ : వరల్డ్కప్ ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టుకు డబుల్ స్ట్రోక్ తగిలింది. ఆ జట్టు హార్డ్హిట్టర్ జేసన్ రాయ్ ఇంగ్లాండ్ ఆడే తర్వాతి రెండు మ్యాచ్లకు దూరం కానున్నాడు. లార్డ్స్ వేదికగా ఈనెల 25న ఆస్ట్రేలియాతో మ్యాచ్కు అందుబాటులో ఉండే అవకాశం ఉందని ఇంగ్లాండ్ టీమ్ మేనేజ్మెంట్ తెలిపింది. గత శుక్రవారం వెస్టిండీస్తో మ్యాచ్లో ఫీల్డింగ్ చేస్తుండగా తొడ కండరాలు పట్టేయడంతో మైదానాన్ని వీడాడు. కేవలం 8 ఓవర్లు మాత్రమే ఫీల్డింగ్ చేశాడు. ఆ తర్వాత బ్యాటింగ్కు కూడా రాలేదు. శనివారం రాత్రి అతని ఎడమ తొడకు స్కానింగ్ తీశారు. మెడికల్ రిపోర్ట్ను వైద్యులు ఆదివారం పరిశీలించగా తొడ కండరాల్లో చీలికలు వచ్చినట్లు గుర్తించారు. మంగళవారం అఫ్గనిస్థాన్తో, శుక్రవారం శ్రీలంకతో ఇంగ్లాండ్ తలపడనుంది. అలాగే ఇంగ్లీష్ టీమ్ సారథి ఇయాన్ మోర్గాన్ కూడా వెన్నునొప్పితో విండీస్తో మ్యాచ్ మధ్యలోనే వెనుదిరిగాడు. నొప్పితో బాధపడుతున్న మోర్గాన్ ఓల్డ్ట్రాఫోర్డ్ మైదానంలో అఫ్గానిస్థాన్తో మ్యాచ్కు మోర్గాన్ దూరం కానున్నాడు. లీడ్స్ వేదికగా శ్రీలంకతో జరిగే మ్యాచ్కు ఫిట్గా ఉంటాడని ఇంగ్లాండ్ భావిస్తోంది. లంకతో మ్యాచ్ వరకు అతడు కోలుకునే తీరుపై బరిలో నిలిచే అవకాశం ఉంది. ప్రపంచకప్లో ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్లు ఆడిన ఇంగ్లాండ్ మూడింటిలో గెలుపొందగా.. ఒక దాంట్లో ఓడిపోయింది.
Mon Jan 19, 2015 06:51 pm