మంచిర్యాల: ఉద్యోగాలు ఇప్పిస్తానని ఓ మహిళ పలువురిని మోసం చేసింది. గురుకులాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని సుమలత అనే మహిళ 132 మందిని మోసం చేసింది. ఒక్కొక్కరి నుంచి రూ.లక్ష నుంచి రూ5 లక్షల వరకు నిందితురాలు వసూలు చేసింది. కస్తూర్బా పాఠశాలలో ఓఎస్డీగా పనిచేస్తున్నానని సుమలత చెప్పుకుంది. మోసం చేసిన మహిళపై బాధితులు మంచిర్యాల డీసీపీకి ఫిర్యాదు చేశారు. నిందితురాలు పరారీలో ఉన్నట్లు బాధితులు డీసీపీకి తెలిపారు. ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm