హైదరాబాద్ :ఢిల్లీలోని షాలిమర్ బాగ్ పోలీసులను నిరసనకారులు వెంబడించి కొట్టారు. నిరసనకారుల చేతిలో స్థానిక ఏసీపీ కేజీ త్యాగి సహా పలువురు పోలీసులు గాయపడ్డారు. నిరసన కారులను చెదరగొట్టే ప్రయత్నంలో పోలీసులపై ఆదివారం నిరసన కారులు మూకదాడికి దిగారు. శనివారం నగరంలోని ముఖర్జీ నగర్లో ఆటో డ్రైవర్ సరబ్జిత్ సింగ్ అతడి కుమారుడు.. ఇద్దరినీ పోలీసులు కొట్టారని ఆదివారం కొంత మంది వ్యక్తులు నిరసనకు దిగారు. అయితే నిరసనకారులు రోడ్డుపై బైఠాయించి ట్రాఫిక్ను నిలుపుదల చేశారు. దీంతో పోలీసులు కల్పించుకుని నిరసనకారులు చెదరగొట్టే ప్రయత్నం చేశారు. దీంతో కోపోద్రిక్తులైన నిరసనకారులు పోలీసులపై దాడికి దిగారు. ఏసీపీ కేజీ త్యాగిని పరిగెత్తించి మరీ దాడికి దిగారు. అంతే కాకుండా పోలీసులను బయటికి చెప్పలేని పదజాలంతో దూషించారు.
Mon Jan 19, 2015 06:51 pm