హైదరాబాద్ : పాకిస్థాన్కు చెందిన 34 మంది వలసదారులకు భారత పౌరసత్వం కల్పిస్తూ రాజస్థాన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ అదనపు కార్యదర్శి రాజీవ్ స్వరూప్ ఈ విషయాన్ని ఓ ప్రకటనలో తెలిపారు. దాదాపు పది సంవత్సరాల క్రితం పాకిస్థాన్ నుంచి భారత్కు వలస వచ్చిన 34 మందికి రాజస్థాన్ ప్రభుత్వం భారత పౌరసత్వాన్ని కల్పించినట్టు ఆయన వివరించారు. కాగా.. జనవరి నుంచి జూన్ 17 వరకూ మొత్తం 79 మంది పాక్ వలసదారులకు భారత పౌరసత్వం కల్పించినట్లు రాజీవ్ స్వరూప్ వెల్లడించారు.
Mon Jan 19, 2015 06:51 pm