మాంచెస్టర్: సహజంగా క్రికెట్ మ్యాచ్లు జరుగుతున్నప్పుడు సినీ తారలు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరవుతుండటం సర్వసాధారణం. తమ జట్టు ఎలాగైనా గెలవాలని వారంతా దగ్గరుండి మరీ ప్రోత్సహిస్తుంటారు. ప్రస్తుత ప్రపంచకప్లోనూ చాలామంది ప్రముఖులు వివిధ మ్యాచ్లకు హాజరై తమ అభిమాన జట్లకు మద్దతు తెలుపుతున్నారు. తాజాగా ఇంగ్లాండ్-అఫ్గానిస్థాన్ మ్యాచ్కు ఓ ప్రత్యేక అతిథి హాజరయ్యారు. ఆయనే అఫ్గాన్ దేశాధ్యక్షుడు అష్రఫ్ ఘనీ. అఫ్గాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ అజీజుల్లాతో కలిసి ఆయన ఈ మ్యాచ్ను వీక్షిస్తూ తమ జట్టుకు మద్దతు తెలిపారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను అఫ్గానిస్థాన్ క్రికెట్ బోర్డు తమ అధికారిక ట్విటర్ ఖాతా ద్వారా పంచుకుంది.
Mon Jan 19, 2015 06:51 pm