అమరావతి: మొదటి విడత నేషనల్ మెడికల్ కౌన్సెలింగ్ బుధవారం ప్రారంభమై ఈ నెల 25 వరకూ కొనసాగుతుంది. తర్వాత జూలై 6 నుంచి 9 వరకూ రెండో విడత కౌన్సెలింగ్, ఆగస్టు 13 నుంచి 15 వరకూ మాప్ఆప్ రౌండ్ కౌన్సెలింగ్తో నేషనల్ కౌన్సెలింగ్ ముగిస్తుంది. మరోవైపు, రాష్ట్రంలో ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఈ నెల 25 నుంచి మొదటి విడత కౌన్సెలింగ్ నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వం, ప్రయివేటు మెడికల్ కాలేజీల్లో కలిపి సుమారు 4000 ఎంబీబీఎస్ సీట్లు, 1500 వరకూ బీడీఎస్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిని భర్తీ చేసేందుకు మాప్ఆ్పతో కలిపి నాలుగు విడతల్లో కౌన్సెలింగ్ నిర్వహించేందుకు వర్సిటీ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm