ఢిల్లీ: ఢిల్లీలో ఇవాళ ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరగనుంది. సమావేశానికి అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులు హాజరుకానున్నారు. సమావేశంలో ఐదు అంశాలపై చర్చించనున్నారు. దేశంలో అన్ని చట్ట సభలకు ఒకేసారి ఎన్నికలు, వెనుకబడిన జిల్లాల అభివృద్ధి, 75వ దేశ స్వాతంత్య్ర దినోత్సవాల నేపథ్యంలో ''నవ భారత'' నిర్మాణ, పార్లమెంటు సమావేశాలు మరింత అర్థవంతంగా నిర్వహించేందుకు మార్గాలు, గాంధీ 150వ జయంతి ఉత్సవాల నిర్వహణ అను అంశాలపై సమావేశంలో చర్చించనున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm